హైదరాబాద్, ఆట ప్రతినిధి: ‘అనంత్ బజాజ్’ స్మారక బ్యాడ్మింటన్ టోర్నీలో కార్తికేయ, శ్రియాన్షి విజేతలుగా నిలిచారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆదివారం ముగిసిన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీ పురుషుల సింగిల్స్లో కార్తికేయ 9-21, 21-10, 21-15తో అలప్ మిశ్రాపై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో శ్రియాన్షి 21-10, 24-22తో దీప్షికను చిత్తు చేసింది. మహిళల డబుల్స్లో శిఖ గౌత్-మనీషా.. పురుషుల డబుల్స్లో హరిహరన్-రూబెన్ కుమార్.. మిక్స్డ్ డబుల్స్లో నవ్నీత్-ప్రియా దేవి జోడీలు విజేతలుగా నిలిచాయి. రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్, సాత్విక్ సాయిరాజ్, శేఖర్, మయాంక్, పూజ తదితరులు పాల్గొన్నారు.