హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 1-0 తేడాతో ఢిల్లీ ఫుట్బాల్ క్లబ్పై అద్భుత విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య పోరు ఆద్యంతం హోరాహోరీగా సాగింది.
మ్యాచ్ ద్వితీయార్ధంలో ఢిల్లీ ప్లేయర్ గగన్దీప్ బాలీ ఓన్ గోల్ చేయడంతో శ్రీనిధి విజయం ఖరారైంది. ఈ గెలుపుతో శ్రీనిధి ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఈ నెల 19న గోకులం కేరళతో శ్రీనిధి ఎఫ్సీ తలపడుతుంది.