హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్ టోర్నీని శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) ఘనంగా ముగించింది. శనివారం దక్కన్ ఎరీనాలో జరిగిన లీగ్ చివరి మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 3-2తో షిల్లాంగ్ లాజంగ్పై ఉత్కంఠ విజయం సాధించింది.
హోరాహోరీగా సాగిన పోరులో శ్రీనిధి తరఫున విలియమ్ అల్వెస్(4ని), రొసెన్బర్గ్ గాబ్రియెల్(16ని), డేవిడ్ కాస్టెండా(84ని) గోల్స్ చేశారు. మరోవైపు ఫ్రాంగ్కి బూమ్(46ని, 87ని) డబుల్ గోల్స్తో ఆకట్టుకున్నాడు. లీగ్లో మొత్తంగా 24 మ్యాచ్లాడిన శ్రీనిధి 14 విజయాలు, 6 డ్రా, 4 ఓటములతో 48 పాయింట్లతో మొహమ్మదీన్(52) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. గోకులం కేరళ (42)కు మూడో స్థానం దక్కింది.