పంజాబ్: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ టీమ్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆదివారం నమ్దారీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 1-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన శ్రీనిధి తరఫున లాల్రోమవియా తొలి అర్ధభాగంలో చేసిన గోల్తో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
రియల్ కశ్మీర్తో గత మ్యాచ్ పోలిస్తే..ఢిల్లీతో పోరులో చీఫ్ కోచ్ కార్లోస్ వాజ్ పింటో మూడు మార్పులు చేశాడు. ఈ పోరులో శ్రీనిధి 4-3-3 వ్యూహాన్ని ఎంచుకోవడం కలిసొచ్చింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మొహమ్మదీన్ తర్వాత శ్రీనిధి రెండో స్థానంలో కొనసాగుతున్నది.