హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల జరిగిన ఆల్ఇండియా బీచ్ వాలీబాల్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు శ్రీకృతి, ఐశ్వర్యను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం అభినందించారు. చెన్నై వేదికగా జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో సత్తాచాటిన ఈ ఇద్దరు.. బ్యాంకాక్లో జరుగనున్న అంతర్జాతీయ చాంపియన్షిప్నకు ఎంపికయ్యారు. జాతీయ టోర్నీలో సత్తాచాటిన యువ కెరటాలు.. అంతర్జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప జేయాలని మంత్రులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి హరికృష్ణ, తెలంగాణ బీచ్ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు రమేశ్బాబు, కార్యదర్శి హనుమంతురెడ్డి, కోచ్ అన్వర్, సుదర్శన్ పాల్గొన్నారు.