Chamari Athapaththu | పొచెఫ్స్ట్రూమ్: మహిళల వన్డే క్రికెట్లో మరో సంచలనం! శ్రీలంక క్రికెట్ దిగ్గజం చమరీ ఆటపట్టు కొత్త చరిత్ర లిఖించింది. బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో చమరీ(139 బంతుల్లో 195 నాటౌట్, 26ఫోర్లు, 5 సిక్స్లు) చిరస్మరణీయ సెంచరీతో చెలరేగింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 302 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన లంక 44.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఓపెనర్ విశ్మి గుణరత్నె(26) నిరాశపర్చగా, చమరీ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టుకు ఇరుసుగా నిలబడింది. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఆటపట్టు సాధికారిక ఇన్నింగ్స్తో కదంతొక్కింది.
ప్రసాదిణి(4), హన్సిమ కరుణరత్నె(3), కవిశ(0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా, నీలాక్షిక సిల్వా(50 నాటౌట్)తో కలిసి ఆటపట్టు జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. తన ఇన్నింగ్స్లో 26 ఫోర్లు, 5 సిక్స్లతో చెలరేగిన చమరీ..శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కింది. దీనికి తోడు మహిళల వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా శ్రీలంక నిలిచింది. తొలుత కెప్టెన్ లౌరా వోల్వార్డ్(184 నాటౌట్) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 301/5 స్కోరు చేసింది. ఈ నిర్ణయాత్మక మూడో వన్డేలో శ్రీలంక 6 వికెట్లతో ఘన విజయం సాధించింది.