గాలె : చండిమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104) సెంచరీలు నమోదు చేసుకోవడంతో ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు చేసింది. అంతకుముందు కరుణరత్నె (179), కుషాల్ మెండిస్ (140) కూడా శతకాలు బాదడంతో లంక 591/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ సోమవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది.