హైదరాబాద్: శ్రీలంక రెండో ఇన్నింగ్లోనూ తడబడుతుంది. ఆట మూడోరోజు ఆదివారం 9 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆశ్విన్ వేసిన బంతిని ఆడబోయిన తిరుమన్నే బ్యాట్ అంచుకు తగిలి శర్మ చేతికి చిక్కింది. శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్లో 174 పరుగుచేయగా భారత్ 574 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు 400 పరుగుల ఆధిక్యం లభించింది.
తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో సత్తా చాటిన రవీంద్ర జడేజా బౌలింగ్లోనూ రాణించి శభాష్ అనిపించుకున్నాడు. జడేజా ఈ మ్యాచ్లో 175 పరుగులు చేసి 5 వికెట్లు తీయడం విశేషం. అశ్విన్, బుమ్రాకు రెండేసి వికెట్లు పడగొట్టగా షమీకి ఒక వికెట్ దక్కింది. భారత్ జట్టులో పంత్ 96, అశ్విన్ 61 పరుగులు చేయగా విహారి 58, వంద టెస్టు ఆడుతున్న కోహ్లీ 45 పరుగులు చేసిన విషయం తెలిసిందే.