షార్జా: ఇప్పటికే సూపర్-12కు అర్హత సాధించిన శ్రీలంక చివరి గ్రూప్ మ్యాచ్లో నెదర్లాండ్స్పై భారీ విజయం సాధించింది. శుక్రవారం గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్లో లంక 8 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో హసరంగ, లహిరు కుమార చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 7.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. కుషాల్ పెరెరా (33 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. మరో మ్యాచ్లో నమీబియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలుపొందింది. గ్రూప్ దశ మ్యాచ్లు ముగిసేసరికి గ్రూప్-‘ఎ’ నుంచి శ్రీలంక, నమీబియా.. గ్రూప్-‘బి’ నుంచి స్కాట్లాం డ్, బంగ్లాదేశ్ సూపర్-12కు అర్హత సాధించాయి.