కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుతిరిగిన తర్వాత కెప్టెన్ డుప్లెసిస్కు చక్కటి సహకారం అందించిన యువ ఆటగాడు రజత్ పటీదార్ (48) హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. జగదీష్ సుచిత్ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు పటీదార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీప్ మిడ్వికెట్లో రాహుల్ త్రిపాఠీకి చిక్కాడు.
దీంతో 105 పరుగుల వద్ద బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సత్తా చాటాడు. పటీదార్ అవుటవడంతో మ్యాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.