లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు తంటాలు పడుతోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్ను ఆవేశ్ ఖాన్ దెబ్బకొట్టాడు. తను బౌలింగ్కు వచ్చిన తొలి ఓవర్లోనే కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16)ను పెవిలియన్ చేర్చిన అతను.. పవర్ ప్లే చివరి ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (13)ను కూడా పెవిలియన్ చేర్చాడు.
పేస్లో మార్పును గమనించలేకపోయిన అభిషేక్.. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి చాలా ఎత్తుగా గాల్లోకి లేచింది. సర్కిల్ అవతల నుంచి పరిగెత్తుకు వచ్చిన మనీష్ పాండే.. బంతిని వదలకుండా క్యాచ్ పట్టేశాడు. దాంతో అభిషేక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసే సరికి సన్రైజర్స్ జట్టు 40/2 స్కోరుతో నిలిచింది.