చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడి ఓడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు చెన్నై ఓపెనర్లు చుక్కలు చూపించారు. రుతురాజ్ గైక్వాడ్ (99), డెవాన్ కాన్వే (85 నాటౌట్) అదరగొట్టడంతో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్ (47) సన్రైజర్స్కు శుభారంభం అందించారు. ఒక దశలో సన్రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ చెన్నై పేసర్ ముకేష్ చౌదరి ఆ జట్టును దెబ్బతీశాడు. నాలుగు వికెట్లతో అతను చెలరేగడంతో.. రాహుల్ త్రిపాఠీ (0), వాషింగ్టన్ సుందర్ (2), శశాంక్ సింగ్ (15) భారీ షాట్లు ఆడలేకపోయారు. ఎయిడెన్ మార్క్రమ్ (17),, నికోలస్ పూరన్ (64 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఈ క్రమంలో విజయానికి 14 పరుగుల దూరంలో సన్రైజర్స్ నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై పగ్గాలు మళ్లీ అందుకున్న ధోనీ.. అభిమానులకు మరోసారి తన మార్కు విజయాన్ని రుచిచూపించినట్లయింది.