హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్స్ పోరులో ఎస్డీఎఫ్సీ 1-0 తేడాతో జార్జ్ టెలిగ్రాఫ్పై అద్భుత విజయం సాధించింది. భారత ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఎస్డీఎఫ్సీ మెరుగైన ప్రదర్శనతో దూసుకెళుతున్నది. బరిలోకి దిగిన తొలిసారే సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్నది. ఎస్డీఎఫ్సీ తరఫున లాల్రోమావియా ఏకైక గోల్ చేశాడు.