హైదరాబాద్, ఆట ప్రతినిధి: టేబుల్ టెన్నిస్ (టీటీ) జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ రజత పతకం సొంతం చేసుకోగా.. స్నేహిత్ కాంస్యంతో మెరిశాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆర్బీఐ తరఫున బరిలోకి దిగన టాప్ సీడ్ శ్రీజ ఫైనల్లో 1-4 (8-11, 11-5, 5-11, 9-11, 10-12)తో దియా పరాగ్ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్నేహిత్ 3-4 (7-11, 11-3, 15-13, 4-11, 10-12, 13-11, 7-11)తో మానవ్ ఠక్కర్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఫైనల్లో సీనియర్ ప్లేయర్ శరత్కమల్ను మట్టికరిపించిన మానవ్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. మరోవైపు గోవా వేదికగా జరుగుతున్న జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు పతకాలతో మెరిశారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో తరుణ్ స్వర్ణం పతకం సాధించగా.. మహిళల సింగిల్స్లో మేఘన రెడ్డి కాంస్య పతకం చేజిక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్లో నవ్నీత్-మనీషా జంట రజత పతకం గెలుచుకుంది.