ఒలోమౌక్(చెక్ రిపబ్లిక్): ఐటీటీఎఫ్ చెక్ ఇంటర్నేషనల్ టీటీ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్లు ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, ఆకుల శ్రీజ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్లో స్నేహిత్ 4-2తో సామ్యుల్ వాకర్పై అలవోక విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ పోరులో శ్రీజ 4-0తో కత్సియారన్యను చిత్తుగా ఓడించి ముందంజ వేసింది. మిగతా గేముల్లో సాతియాన్ 4-0తో థామస్ కోల్దాస్పై, జీత్ చంద్ర 4-2తో అలెగ్జాండర్ రాబినోట్పై, ఆర్చనా కామత్ 4-3తో మర్కెటా సెవికోవాపై విజయాలతో ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించారు. ఇదే టోర్నీలో అండర్-21 విభాగంలో స్నేహిత్కు సెమీఫైనల్లో నిరాశ ఎదురైంది. హంగరీ ప్లేయర్ అంద్రాస్ సబా చేతిలో 1-3తో ఓడిపోయాడు.