న్యూఢిల్లీ: చైనా వేదికగా ఈ నెల 23 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్ కోసం కేంద్ర క్రీడాశాఖ సవరించిన జాబితాను ప్రకటించింది. కొత్తగా 22 మంది ప్లేయర్లకు చోటు కల్పిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆసియా క్రీడ ల్లో పాల్గొనే భారత బృందం సంఖ్య 921కు చేరుకుంది. ఇందులో 655 మంది అథ్లెట్లు కాగా, 260 మంది కోచ్లు, సహాయక సిబ్బంది ఉన్నారు. మోడ్రన్ పెంటాథ్లాన్ కోసం తాజాగా అథ్లెట్లను ఎంపిక చేయడంతోమెగాటోర్నీలో భారత్ మొత్తం 39 క్రీడా విభాగాల్లో పోటీకి దిగుతున్నదని క్రీడా శాఖ పేర్కొంది.