న్యూఢిల్లీ: కరోనా బారిన పడి మృతిచెందిన హాకీ దిగ్గజాల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. 1980 ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యులైన రవీందర్ పాల్ సింగ్, ఎమ్కే కౌషిక్ ఇటీవల కన్నుమూయగా.. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. దేశానికి వారు చేసిన సేవలను వెలకట్టలేమని.. ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాలకు అండగా ఉంటామని రిజిజు ట్విట్టర్లో పేర్కొన్నాడు.