బెర్లిన్: స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ వేసవి క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. బెర్లిన్ వేదికగా ముగిసిన ఈ పోటీల్లో భారత్ 202 పతకాలు కొల్లగొట్టింది. అందులో 76 స్వర్ణాలు, 75 రజతాలు, 51 కాంస్యాలు ఉన్నాయి. పోటీల చివరి రోజు మనవాళ్లు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో 6 మెడల్స్ చేజిక్కించుకున్నారు. ఈ క్రీడల్లో భారత్ తరఫున 198 మంది అథ్లెట్లు 16 క్రీడాంశాల్లో పోటీపడ్డారు.