Sikki Reddy | మాడ్రిడ్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో భారత జోడీ సిక్కిరెడ్డి, సుమిత్రెడ్డి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో సిక్కి, సుమిత్ ద్వయం 14-21, 21-11, 21-17తో రేహాన్ నౌఫల్, లిసా అసు కుసుమవతి(ఇండోనేషియా) జంటపై అద్భుత విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన పోరులో సిక్కి, సుమిత్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. తొలి గేమ్ను ప్రత్యర్థి చేజార్చుకున్న సిక్కి, సుమిత్ తిరిగి పుంజుకుని పోటీలోకి వచ్చారు.
చక్కని సమనయ్వంతో డ్రాప్ షాట్లు, నెట్గేమ్తో వరుసగా రెండు గేమ్లను దక్కించుకుని మ్యాచ్ను కైవసం చేసుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 26-24, 17-21, 20-22తో సుపనిద కాటెతాంగ్(థాయ్లాండ్) చేతిలో ఓడి నిష్క్రమించింది. మహిళల డబుల్స్లో తనీషా క్రాస్టో, అశ్విని పొనప్ప జోడీ 13-21, 19-21తో లీ చియ్, టెంగ్ చున్ జంట చేతిలో ఓడింది.