సేలం : దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో స్పిన్నర్ సాయి కిశోర్ అదరగొట్టడంతో సౌత్జోన్కు భారీ ఆధిక్యం లభించింది. సాయి కిశోర్ 70 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆలౌటయింది. దీంతో సౌత్జోన్కు 423 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం ఆట ముగిసే సమయానికి సౌత్జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేయడంతో మొత్తంగా 580 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్నందున సౌత్జోన్ ఫైనల్కు చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.కోయంబత్తూర్లో వెస్ట్జోన్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ విజయంకోసం 501 పరుగులు చేయాల్సిన స్థితిలో మూడో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్లకు 33 పరుగులు చేసింది. ఓటమి తప్పించుకోవాలంటే సెంట్రల్ జోన్ ఇంకా 468 పరుగులు చేయాలి. వెస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆలౌటైంది.
సంక్షిప్త స్కోర్లు : సౌత్ జోన్- 630/8, 157/1; నార్త్ జోన్- 207: వెస్ట్ జోన్ 257, 371; సెంట్రల్ జోన్-128, 33/2.