Deodhar Trophy | దుచెరీ: దేశవాళీ టోర్నీ దేవ్ధర్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్జోన్ను చిత్తుచేసింది. మొదట సౌత్జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. రోహన్ (107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (63), నారాయణ్ జగదీశన్ (54) హాఫ్సెంచరీలతో రాణించారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఈస్ట్జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాటం జట్టును గట్టెక్కించలేకపోయింది. సౌత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.