జూబ్లీహిల్స్: సౌత్జోన్ వీల్చైర్ బాస్కెట్బాల్ టోర్నీలో తెలంగాణ జట్టు రన్నరప్గా నిలిచింది. కోయంబత్తూరు వేదికగా ఈనెల 27 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తొలిసారి నిర్వహించిన ఈ పోటీల్లో లీగ్ దశలో టాప్లో నిలిచిన తెలంగాణ జట్టు తమిళనాడుతో జరిగిన ఫైనల్లో పోరాడి ఓడింది.
టోర్నీలో అత్యధికంగా 99 పాయింట్లు సాధించిన రమావత్ కోటేశ్వర్ అత్యంత విలువైన ప్లేయర్ అవార్డు దక్కించుకున్నట్లు యూసుఫ్గూడ కేవీబీఆర్ బాస్కెట్బాల్ కోచ్ సోహైల్ఖాన్ పేర్కొన్నారు.