జొహాన్నెస్బర్గ్ : వెస్టిండీస్తో బుధవారం ఆరంభమైన రెండో టెస్టు తొలి రోజు దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. మార్క్మ్ (96), టోని డి జార్జి (85) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు 76 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు.
ఆ తరువాత మార్క్మ్,్ర టోని సెంచరీ భాగస్వామ్యం (116)తో ఇన్నింగ్స్ జోరందుకుంది. ఒక దశలో దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 248 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే విండీస్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి 63 పరుగుల వ్యవధిలో మరో అయిదు వికెట్లు పడగొట్టి భారీ స్కోరుకు కళ్లెం వేశారు.