ODI World Cup 2023 : దక్షిణాఫ్రికా(South Africa) క్రికెట్ జట్టు వరల్డ్ కప్ (ODI World Cup 2023)కోసం భారత్కు బయలు దేరింది. ఇండియాకు వెళ్లే ముందు సఫారీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma)తో పాటు 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భారత విమానం ఎక్కారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఇది 9వ వరల్డ్ కప్. అయితే.. ఈ మెగా టోర్నీకి ముందు సఫారీ జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
𝐓𝐡𝐞 𝐂𝐥𝐚𝐬𝐬 𝐨𝐟 𝟐𝟎𝟐𝟑 🇿🇦🏏 #CWC23 #BePartOfIt pic.twitter.com/mz9mEvt9Hh
— Proteas Men (@ProteasMenCSA) September 23, 2023
ప్రధాన పేసర్లు అన్రిచ్ నార్ట్జ్(Anrich Nortje), సిసండ మగల(Sisanda Magala) గాయంతో టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో, నార్ట్జ్, మగల స్థానంలో అండిలే పెహ్లూవాకియో(Andile Phehlukwayo), లిజాద్ విల్లియమ్స్(Lizaad Williams)లను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సఫారీ జట్టు కోచ్ రాబ్ వాల్టర్(Rob Walter) వెల్లడించాడు.
అన్రిచ్ నార్ట్జ్, సిసండ మగల
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను 3-2తో నెగ్గిన దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉంది. హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen), డేవిడ్ మిల్లర్(David Miller), డస్సెన్, డికాక్ రూపంలో టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్లంతా సూపర్ ఫామ్లో ఉండడంతో సఫారీ జట్టు టైటిల్పై గంపెడు ఆశలు పెట్టుకుంది. భారత గడ్డపై అక్టోబర్ 5న ప్రపంచ కప్ మొదలవ్వనుంది. తెంబా బవుమా త్వంలోని సఫారీ జట్టు అక్టోబర్ 7న శ్రీలంకతో తలపడనుంది.