Sourav Ganguly : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్(ICC World Cup 2023) షెడ్యూల్ ఖరారు అయినప్పటి నుంచి భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. దాయాదుల పోరులో ఈసారి కూడా భారత జట్టు పైచేయి సాధిస్తుందని మాజీలు చెప్తున్నారు. అయితే.. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కంటే భారత్, ఆస్ట్రేలియా పోరు గొప్పగా ఉంటుందని చెప్తున్నాడు. అందుకు కారణం ఏంటో అతని మాటల్లోనే…
‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై చాలా హైప్ ఉంది. కానీ, రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరాటం జరగకపోవచ్చు. ఎందుకంటే..? చాలా కాలం నుంచి ఐసీసీ(ICC) టోర్నమెంట్లలో భారత జట్టు పాకిస్థాన్ను ఓడిస్తూ వస్తోంది. అందుకని నా దృష్టిలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ గొప్పగా ఉండనుంది’ అని గంగూలీ వివరించాడు. వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా అక్టోబర్ 8న ఆసీస్తో, అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా పాక్తో తలపడనుంది.
భారత్, పాకిస్థాన్ జట్లు నిరుడు టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2022)లో ఎదురుపడ్డాయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో టీమిండియా అనూహ్య విజయం సాధించింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(82 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ను గెలిపించాడు. రెండు జట్లు మళ్లీ ఆసియా కప్(Asia Cup 2023)లో శ్రీలంక గడ్డపై తాడోపేడో తేల్చుకోనున్నాయి.
పాక్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
ఆ తర్వాత వరల్డ్ కప్లో భారత్, పాక్ పోరాటానికి తెరలేవనుంది. ఈ ఏడాది వరల్డ్ కప్కు టీమిండియా ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 19న విజేత ఎవరో తేలిపోనుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే..? ఫైనల్ మ్యాచ్తో పాటు సెమీ ఫైనల్స్కు కూడా రిజర్వ్ డేను కేటాయించారు.