కోల్కతా: బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం నామినేషన్ దాఖలు చేశాడు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవీ కాలం ముగియడంతో గంగూలీ ఇక తన సేవలు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు అందించేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ నెల 31న క్యాబ్ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ గెలిస్తే గంగూలీ రెండో విడత క్యాబ్ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనున్నాడు. నిబంధల ప్రకారం గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు వీలు ఉన్నా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా కనుసన్నల్లోని బోర్డు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నాడు.