RCB vs GG : మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో విజయం సాధించింది. ఓపెనర్ సోఫీ డెవినే (Sophie Devine) విధ్వంసక బ్యాటింగ్తో గుజరాత్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన డెవినే ఫోర్లు, సిక్స్లతో బ్రబౌర్న్ స్టేడియాన్ని హోరెత్తించింది. భారీ హిట్టింగ్ చేసిన ఆమె దొరికిన బంతిని దొరికినట్టు స్టాండ్స్లోకి పంపింది. ఆమె జోరు చూస్తే డబ్ల్యూపీఎల్లో తొలి సెంచరీ కొట్టేలా కనిపించింది. కానీ, ఒక్క రన్ తేడాతో శతకం చేజార్చుకుంది. అయితే.. అప్పటికే ఆర్సీబీ విజయం దాదాపు ఖాయమైంది. రెండో గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
డబ్ల్యూపీఎల్లో స్మృతి మంధాన సేన గుజరాత్ను చిత్తు చేసింది. ఓపెనర్ సోఫీ డెవినే ఒంటి చేత్తో మ్యాచ్ను గుజరాత్ నుంచి లాగేసుకుంది. ఈ టోర్నమెంట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసింది. స్మృతి మంధాన(36)తో కలిసి తొలి వికెట్కు 125 రన్స్ జోడించింది. 20 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ కొట్టింది. . డబ్ల్యూపీఎల్లో మూడో వేగవంతమైన ఫిఫ్టీ బాదింది. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. 36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్లతో సెంచరీకి చేరువైంది. కిమ్ గార్త్ ఓవర్లో అశ్విని కుమారి సూపర్ క్యాచ్ పట్టడంతో 99 వద్ద డెవినే ఔటయ్యింది. అప్పటికీ ఆర్సీబీ స్కోర్ ..151.
ఆ తర్వాత అలీసా పెర్రీ (19), హీథర్ నైట్ (22) లాఛనంగా మ్యాచ్ ముగించారు. వీళ్లు ధాటిగా ఆడడంతో 4.3 ఓవర్లు ఉండగానే ఆర్సీబీ విజయం సాధించింది. డెవినేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్, తనూజ కన్వర్ తలా ఒక వికెట్ తీశారు.
189 టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు స్మృతి మంధాన , సోఫీ డెవినే శుభారంభం ఇచ్చారు. వీళ్లు పవర్ ప్లేలో దంచి కొట్టడంతో 77 పరుగులు వచ్చాయి. అష్ గార్డ్నర్ వేసిన రెండో ఓవర్లో సోఫీ డెవినే చెలరేగింది. రెండు సిక్స్లు, రెండు ఫోర్లు బాదింది. దాంతో, ఏకంగా 24 రన్స్ వచ్చాయి. అక్కడితో మొదలు ప్రతి ఓవర్లో బౌండరీ, సిక్స్తో మంధాన, డెవినే స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) 188 పరుగులు స్కోర్ చేసింది. ఓపెనర్ లారా వొల్వార్డ్ (68) హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. గత మ్యాచ్లో అర్ధ శతకం బాదిన అష్ గార్డ్నర్(41) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది. 27 పరుగుల ఓపెనర్ సోఫియా డంక్లీ (16)ని సోఫీ డెవినే బౌల్డ్ చేసింది. వొల్వార్డ్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్తో హాఫ్ సెంచరీ సాధించింది. సబ్బినేని మేఘన (31)తో కలిసి రెండో వికెట్కు 63 రన్స్, అష్ గార్డ్నర్తో కలిసి మూడో వికెట్కు 52 పరుగులు జోడించింది. చివర్లో హర్లీన్ డియోల్ (12), దయలాన్ హేమలత (16)రెచ్చిపోయి ఆడారు. దాంతో, గుజరాత్ 20 ఓవర్లలో 188 రన్స్ చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసింది. సోఫీ డెవినే, ప్రీతీ బోస్ తలా ఒక వికెట్ తీశారు.