బెంగళూరు: రంజీ ట్రోఫీలో మాజీ చాంపియన్ ముంబై ప్రపంచ రికార్డు విజయంతో దుమ్మురేపింది. వార్ వన్సైడ్ అన్న రీతిలో పూర్తి ఏకపక్షంగా సాగిన క్వార్టర్స్ మ్యాచ్లో ముంబై 725 పరుగుల భారీ తేడాతో ఉత్తరాఖండ్పై అద్భుత విజయం సాధించింది. ఈ క్రమంలో ఫస్ట్క్లాస్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై..92 ఏండ్ల షెఫీల్డ్ షీల్డ్ రికార్డును తుడిచిపెట్టింది. న్యూసౌత్వెల్స్ జట్టు 685 పరుగుల తేడాతో క్వీన్స్లాండ్పై గెలువడం ఇప్పటి వరకు రికార్డు.
రంజీ ట్రోఫీ విషయానికొస్తే 1953-54లో బెంగాల్ టీమ్ 540 పరుగుల తేడాతో ఒడిశాను మట్టికరిపించింది. మ్యాచ్ విషయానికొస్తే 795 పరుగుల భారీ లక్ష్యఛేదన కోసం నాలుగో రోజు బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ 27.5 ఓవర్లలో 69 పరుగులకు కుప్పకూలింది. ధవల్ కులకర్ణి(3/11), ములానీ(3/15), తనుశ్ కోటియాన్(3/13) ధాటికి ఉత్తరాఖండ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. శివమ్ ఖురానా(25 నాటౌట్), కునాల్ చండేలా(21) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. పంజాబ్పై మధ్యప్రదేశ్, కర్ణాటకపై ఉత్తర్ప్రదేశ్ గెలిచి సెమీస్లోకి ప్రవేశించాయి.