హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ ప్లేయర్లను ప్రోత్సహించేందుకు డెస్టినేషన్ పూల్ అకాడమీ నిర్వహించిన టీమ్ స్నూకర్ చాంపియన్షిప్లో సుశీల్, అమన్ జోడీ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సుశీల్, అమన్ ద్వయం 3-0 ఫ్రేమ్స్తో బ్రాండన్, రవీష్ జంటపై గెలిచింది. దివంగత ప్లేయర్ అరవింద్ పేరిట సాగిన ఈ టోర్నీలో 100కు పైగా జాతీయ, రాష్ట్ర స్నూకర్ ప్లేయర్లు పోటీపడ్డారు. స్నూకర్ నేర్చుకోవాలనే యువ ప్లేయర్లను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా డెస్టినేషన్ పూల్ ప్రతినిధులు శ్రవణ్కుమార్, సందీప్రెడ్డి పేర్కొన్నారు. విజేతలకు రాష్ట్ర క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అప్పారావు నగదు బహుమతి ట్రోఫీలు అందజేశారు.