నాగ్పూర్: టెస్టు మ్యాచ్లు గెలువాలంటే క్యాచ్లు ముఖ్యమని టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి నాలుగు మ్యాచ్ల ‘బోర్డర్-గవాస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం టీమిండియా నాగ్పూర్లో.. ఆస్ట్రేలియా బెంగళూరులో శిక్షణ కొనసాగిస్తున్నాయి. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను ఆదివారం బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో కోచ్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘ప్లేయర్లంతా ఉత్సాహంగా ఉన్నారు. గత నెలంతా వన్డేలు, టీ20లు ఆడాం.. చాన్నాళ్ల తర్వాత టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నాం. ఆటగాళ్లంతా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫీల్డింగ్లోనూ కష్టపడుతున్నారు. టెస్టుల్లో స్లిప్ క్యాచ్లు ముఖ్యం. అందుకే ఫీల్డింగ్ ప్రాక్టీస్పై దృష్టి పెట్టాం’ అని పేర్కొన్నాడు.