హైదరాబాద్: వన్ డే ప్రపంచకప్లో భాగంగా మరికాసేపట్లో శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డాసన్ శనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో కాసున్ రజిత స్థానంలో తీక్షణను తుది జట్టులోకి తీసుకున్నట్లు శనక తెలిపాడు. పిచ్ చాలా పొడిగా ఉన్నదని, తొలి 10 ఓవర్లు తమకు చాలా కీలకమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. తాము కూడా జట్టులో చిన్న మార్పు చేశామని ఫఖార్ స్థానంలో షఫీఖ్ను తుది జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు.
శ్రీలంక తుది జట్టు: పాతుమ్ నిస్సంక, కుషాల్ పెరీరా, కుషాల్ మెండిస్ (వికెట్ కీపర్), సాదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, డాసన్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహీశ్ తీక్షణ, మతీషా పతిరన, దిల్షాన్ మధుశంక.
పాకిస్థాన్ తుది జట్టు: అబ్దుల్లా షఫీఖ్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మాద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షహీన్ అఫ్రిది, హరీష్ రవూఫ్.