ఆసియా కప్ సూపర్-4లో భారత్ను ఓడించిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచాడు. ఈ స్టేడియంలో గత మ్యాచ్ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఒక జట్టుగా తాము రాణించామన్నాడు. ఉస్మాన్, హసన్ స్థానంలో నసీం షా, షాదాబ్ ఖాన్ ఆడుతున్నారని చెప్పాడు. తాము టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకొని ఉండేవాళ్లమని లంక సారధి దాసున్ శనక చెప్పాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవన్నాడు.