ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పేసర్లు దుమ్మురేపారు. వీరి ధాటికి టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక బ్యాటర్లు తడబడిపోయారు. జట్టుకు అద్భుతమైన ఆరంభాలు ఇస్తూ వచ్చిన కుశాల్ మెండిస్ (0) తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే నిశంక (8), గుణతిలక (1) కూడా అవుటయ్యారు.
ఇలాంటి సమయంలో ధనంజయ డిసిల్వ (28) మాత్రమే జట్టుకు అండగా నిలిచాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా అతను ధాటిగా ఆడటంతో శ్రీలంక జట్టు పవర్ప్లే ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. అయితే 8వ ఓవర్లో ఇఫ్తికార్ అహ్మద్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చిన ధనంజయ డిసిల్వ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో లంక జట్టు 53 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.