హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహారాష్ట్ర వేదికగా ఈ నెల 1 నుంచి మొదలయ్యే జాతీయ సాఫ్ట్బాల్ టోర్నీకి లక్సెట్టిపేట గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి చెందిన ఆరుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టులో భూమిక, శాలిని, స్ఫూర్తి, స్నేహ, స్వాతి, లక్ష్మి ఉన్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ లలితా కుమారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల కాగజ్నగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ టోర్నీలో ఈ ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబర్చడం ద్వారా జాతీయ టోర్నీకి ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర్రావు, మౌనిక, మల్లిక, మమత ప్లేయర్లను అభినందించారు.