టోక్యో: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు.. 21-16, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హా యు (చైనా)కు షాకిచ్చింది. 35 నిమిషాల్లోనే పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో తెలుగమ్మాయి.. తొలి గేమ్లో రిథమ్ అందుకున్నాక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
రెండో గేమ్లో 8-0 ఆధిక్యంలో ఉన్న ఆమె ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి ప్రతిఘటనేమీ లేకుండానే గేమ్తో పాటు మ్యాచ్నూ ముగించింది. క్వార్టర్స్లో సింధు.. జపాన్కే చెందిన నొజొమి ఒకుహారాతో తలపడనుంది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టొ- ధృవ్ కపిల 20-22, 17-21తో టాప్ సీడ్ ఫెంగ్ యాన్ ఝె-హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడారు.