కౌలాలంపూర్: హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు(PV Sindhu).. మలేషియా మాస్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో బుసానన్ ఆంగ్బామ్రుంగపాన్పై 13-21, 21-16, 21-12 స్కోరుతో పీవీ సిందు విజయం సాధించింది. ఈ ఏడాదిలో బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. చివరిసారి 2023 స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో ఆమె ఫైనల్ వరకు వెళ్లింది. ఇవాళ్టి మ్యాచ్ ఆరంభంలో.. పీవీ సింధు తడబడింది. తొలి గేమ్లో బుసానన్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ గేమ్ను బుసానన్ ఈజీగా కొట్టేసింది. అయితే రెండో గేమ్లో పుంజుకున్న సింధు.. ఆ తర్వాత తన ఆటతీరుతో ఆకట్టుకున్నది. కీలకమైన మూడో గేమ్లోనూ పీవీ సింధు తన సత్తా చాటింది. దీంతో మలేషియా మాస్టర్స్ ఫైనల్లోకి పీవీ సింధు ఎంట్రీ ఈజీ అయ్యింది. ఫైనల్లో ఆమె చైనాకు చెందిన జెడ్వై వాంగ్తో పోటీపడనున్నది.
PV Sindhu through to the finals at the #MalayasiaMasters . First masters final of the year for her. pic.twitter.com/LBuheFToK9
— Pranay Swain (@pranayswain) May 25, 2024