టోక్యో: గాయం నుంచి తిరిగి కోలుకొని మైదానంలో అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నది. ఈ ఏడాది ఆడిన 12 టోర్నీల్లో ఆరింట తొలి రౌండ్లోనే నిష్క్రమించిన తెలుగమ్మాయి.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 జపాన్ ఓపెన్కు సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో సింధుతో పాటు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి బరిలోకి దిగనున్నారు. నిరుడు బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం పతకంతో పాటు.. ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్షిప్, ఇండోనేషియా ఓపెన్, కొరియా ఓపెన్లలో విజేతగా నిలిచిన సాత్విక్-చిరాగ్ జంట అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది.