న్యూఢిల్లీ: బోక్సామ్ అంతర్జాతీయ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్కు రజత పతకం దక్కింది. 57 కేజీల పురుషుల విభాగం ఫైనల్కు దూసుకొచ్చిన హుసామ్.. కరోనా వైరస్ ఆందోళన కారణంగా ప్రత్యర్థి జీన్ పౌల్తో తలపడలేకపోయాడు. అయితే ఎవరికి పాజిటివ్ రావడం ద్వారా వాకోవర్ ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని నిర్వాహకులు వెల్లడించలేదు. కాగా భారత స్టార్ మనీశ్ కౌశిక్ (63కేజీలు)కు స్వర్ణం దక్కింది. ఫైనల్లో నికోలై టెర్టెర్యాన్ (డెన్మార్క్)ను అతడు చిత్తుచేశాడు. కాగా ఫైనల్లో యుబా సిసోకో చేతిలో ఓడిన వికాస్ కృష్ణన్ వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. సిమ్రన్జిత్ కౌర్ (60కేజీలు), పూజా రాణి (60 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు) సైతం రజతాలతో సరిపెట్టుకున్నారు.