ఈ మ్యాచ్తో జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజాతో పాటు ఐర్లాండ్ ప్లేయర్ నాథన్ ఎలీస్ ఐపీఎల్ అరంగేట్రం చేశారు. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన వీరిద్దరూ తొలి మ్యాచ్లో ఫర్వాలేదనిపించారు. తొలుత బ్యాటింగ్లో 16 పరుగులు చేసిన సికందర్.. బౌలింగ్లో ఓ వికెట్ పడగొట్టాడు. ఎలీస్కు బ్యాటింగ్ అవకాశం రాకపోగా.. బౌలింగ్లో ఓ వికెట్ తీశాడు.