హైదరాబాద్, ఆట ప్రతినిధి: కజకిస్థాన్లో ఇటీవల జరిగిన ఆన్లైన్ కరాటే చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన జవేరియా నాజ్, హజెరా మహ్వీన్ ఆకట్టుకున్నారు. యూరోపియన్ యూనియన్ ఆఫ్ నేషనల్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో జవేరియా పసిడి పతకంతో మెరువగా, హజెరా కాంస్య పతకం సొంతం చేసుకుంది. మొత్తం 11 దేశాలకు చెందిన ప్లేయర్లు పాల్గొన్న చాంపియన్షిప్లో భారత బృందం రెండు స్వర్ణాలు సహా రజతం, మూడు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుంది.