ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్లు.. వచ్చిన వాళ్లు వచ్చినట్లు బాదుకుంటూ వెళ్లడంతో.. భారత్ రికార్డు స్కోరు చేసింది. తన పరుగుల దాహం తీరనిదని యువ ఓపెనర్ గిల్ మరో సెంచరీతో నిరూపిస్తే.. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన శ్రేయస్ తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ శతక్కొట్టాడు. భారీ స్కోరుకు బాటలు వేసిన ఈ జోడీ సెంచరీలఅనంతరం ఔట్ కావడంతో కంగారూలు ఊపిరి పీల్చుకుందాం అనుకుంటే.. రాహుల్, ఇషాన్ రాకతో వారి పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది. ఈ జంట అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్తే.. ఆఖర్లో సూర్యాభాయ్ మ్యాచ్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఒకే ఓవర్ నాలుగు సిక్సర్లు అరుసుకున్న ఈ ‘మిస్టర్ 360’.. రికార్డు హాఫ్ సెంచరీతో వన్డేల్లో ఆస్ట్రేలియాపై టీమ్ అత్యధిక స్కోరు చేయడంలో ఇతోధిక సాయం చేశాడు.
వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీమ్ దుమ్మురేపుతున్నది. ఇటీవల ఆసియాకప్ చేజిక్కించుకున్న భారత్.. తాజాగా కంగారూలను చిత్తుకింద కొట్టింది. గత మ్యాచ్ కనీస పోటీనిచ్చిన ఆసీస్.. ఇండోర్ మ్యాచ్ ఆ మాత్రం కూడా ప్రభావం చూపలేకపోయింది. మరో మ్యాచ్ మిగిలుండగానే కంగారూలపై సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ తదుపరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ప్రతిష్ఠాత్మక వరల్డ్ నంబర్ ర్యాంక్ బరిలోకి దిగనుంది. ఇక నామమాత్రమైన మూడో మ్యాచ్ కూడా కంగారూలను కసితీరా కొడితే.. ప్రశాంతంగా ప్రపంచకప్ వేట ప్రారంభించొచ్చు!
ఇండోర్: వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీమ్ సాధికారిక ఆటతీరుతో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ ఒడిసి పట్టింది. మూడు మ్యాచ్ సిరీస్ భాగంగా ఆదివారం హోల్కర్ స్టేడియంలో జరిగిన పోరులో భారత్ 99 పరుగుల తేడాతో (డక్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఆసీస్ చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో విశ్వరూపం చూపారు. ఈ ఏడాది గిల్ ఇది ఐదో శతకం కాగా.. ఈ మైదానంలో వరుసగా రెండోది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో హాఫ్ ఆకట్టుకుంటే.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు దడదడలాడించాడు. ఇక ఆఖర్లో సూర్యకుమార్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపాడు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న చందంగా వీర విహారం చేశాడు. ఆసీస్ బౌలర్లలో 100 పరుగులు సమర్పించుకున్న కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం వర్షం కారణంగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317గా నిర్ణయించగా.. కంగారూలు 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటయ్యారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన సీన్ అబాట్ (54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. టాపార్డర్ వార్నర్ (53; 7 ఫోర్లు, ఒక సిక్సర్) ఒక్కడే పర్వాలేదనిపించాడు. మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0), లబుషేన్ (27), ఇంగ్లిస్ (6), కారీ (14) విఫలమయ్యారు. భారత బౌలర్లలో రెండో ఓవర్ ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ భయపెడితే.. స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే బుధవారం రాజ్ జరుగనుంది.
1 వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఇదే (399/5) అత్యధిక స్కోరు. 2013లో చేసిన 383/6 స్కోరు రెండో
స్థానానికి చేరింది.
ఆసీస్ వేగవంతమైన (24 బంతుల్లో) అర్ధశతకం సాధించిన భారత ప్లేయర్ సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు. కోహ్లీ (27 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు.
1 వన్డేల్లో 3000 సిక్స్ కొట్టిన తొలి జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది.
1 వన్డేల్లో తొలి 35 ఇన్నింగ్స్ అత్యధిక (1917) పరుగులు చేసిన బ్యాటర్ శుభ్ గిల్ నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా (1844) రికార్డును గిల్ తుడిచిపెట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఒకే ఓవర్లో అత్యధిక(4) సిక్సర్లు కొట్టిన బ్యాటర్ సూర్యకుమార్ నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 399/5 (గిల్ 104, శ్రేయస్ 105; గ్రీన్ 2/103),
ఆస్ట్రేలియా: 28.2 ఓవర్లలో 217 ఆలౌట్ (అబాట్ 54, వార్నర్ 53; అశ్విన్ 3/41, జడేజా 3/42).