న్యూఢిల్లీ: రానున్న ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా..గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి మారిన నేపథ్యంలో గిల్ను కెప్టెన్సీ వరించింది. గత రెండు సీజన్లు గుజరాత్కు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ తొలి సీజన్లోనే జట్టును విజేతగా నిలిపాడు. అయితే ప్లేయర్ల బదిలీల నేపథ్యంలో పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది. తనను కెప్టెన్గా ఎంపిక చేయడంపై గిల్ స్పందిస్తూ ‘గుజరాత్కు నాయకత్వాన్ని వహించడాన్ని గర్వంగా ఫీలవుతున్నాను. నాపై నమ్మకం ఉంచుతూ ఈ బాధ్యతలు అప్పగించిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. గత రెండు సీజన్లలో అద్భుతమైన ఫలితాలు సాధించాం. రానున్న రోజుల్లో జట్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నాడు. మరోవైపు పాండ్యా ఎక్స్(ట్విటట్టర్)లో స్పందిస్తూ ‘తిరిగి ముంబై జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. ముంబై, వాంఖడే, పల్టాన్ మరిచిపోలేని అనుభూతులు’ అని రాసుకొచ్చాడు.