కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో.. మొదటి రోజు భోజన విరామం తర్వాత ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్లో హాఫ్ సెంచరీ చేసిన ఓపెనర్ శుభమన్ గిల్.. తన స్కోర్కు మరో ఒక్క పరుగు జోడించి 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. బౌలర్ జేమీసన్ అతన్ని క్లీన్బౌల్డ్ చేశాడు. ఇక వన్డౌన్లో వచ్చిన పుజారా కూడా నిష్క్రమించాడు. 26 రన్స్ చేసిన పుజారా.. టిమ్ సౌథీ బౌలింగ్లో క్యాచ్ అవుటయ్యాడు. తాజా సమాచారం అందేవరకు భారత్ 40 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 113 రన్స్ చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్లు క్రీజ్లో ఉన్నారు. ఇవాళ ఉదయం టాస్ గెలిచిన ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.