కాన్పూర్: శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. అరంగేట్రం చేసిన టెస్టులోనే.. శతకంతో చెలరేగాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ నమోదు చేశాడు. ఆడుతున్న మొదటి టెస్టులోనే.. అయ్యర్ సెంచరీ చేయడం విశేషం. అయ్యర్ ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 258 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆరంభంలో జలక్ తగిలింది. తొలి రోజు హాఫ్ సెంచరీ చేసిన జడేజా తన స్కోర్కు పరుగులేమీ జోడించకుండానే వెనుదిరిగాడు. టిమ్ సౌథీ బౌలింగ్లో అతను బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సాహా కూడా వెంటనే నిష్క్రమించాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ 104, అశ్విన్ 14 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఇండియా 96 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 రన్స్ చేసింది.