కోల్కతా: భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వెన్నెముక గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కు దూరమైన శ్రేయస్.. శస్త్రచికిత్స అనంతరం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.
శ్రేయస్ గైర్హాజరీలో ఈ ఏడాది కేకేఆర్ టీమ్కు నితీశ్ రాణా కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి నితీశ్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ వెల్లడించింది. ఆసియాకప్తో పునరాగమనం చేసిన శ్రేయస్.. వన్డే వరల్డ్కప్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.