యెచెయోన్: ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సిద్ధార్థ్ చౌదరి పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీ షాట్పుట్లో సిద్ధార్థ్ అదుర్స్ అనిపించాడు. సోమవారం జరిగిన పోటీల్లో సిద్ధార్థ్ గుండును 19.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. 17 ఏండ్ల సిద్ధార్థ్ మూడో ప్రయత్నంలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పతకం కైవసం చేసుకున్నాడు. జావెలిన్ త్రోలో శివమ్ (72.34 మీటర్లు), పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో షారుక్ ఖాన్ (8 ని. 51.74 సె.), లాంగ్ జంప్లో సుస్మిత (5.96 మీ.) రజత పతకాలు గెలుచుకున్నారు.