కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మేనల్లుడు మహమ్మద్ హురేరా దేశవాళీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీ సాధించి మామకు తగ్గ అల్లుడిగా గుర్తింపు సాధించాడు. ఖైద్-ఎ-ఆజమ్ ట్రోఫీలో మహమ్మద్ హురేరా (341 బంతుల్లో 311 నాటౌట్; 40 ఫోర్లు, 4 సిక్సర్లు) నయా రికార్డు సృష్టించాడు. నార్తర్న్ జట్టు తరఫున బరిలోకి దిగిన 19 ఏండ్ల హురేరా పరుగుల వరద పారించి.. బలూచిస్థాన్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. పాకిస్థాన్ తరఫున త్రిశతకం సాధించిన రెండో పిన్న వయసు క్రికెటర్గా హురేరా నిలిచాడు. ఓవరాల్గా పాక్ గడ్డపై ఇది 23వ త్రిశతకం కావడం విశేషం. ప్రస్తుతం హురేరా పాకిస్థాన్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.