న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్(Shoaib Malik), నటి సానా జావెద్.. ఈద్ సంబరాలను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ సోషల్ మీడియాలో అకౌంట్లో ఆ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేశారు. సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన షోయెబ్.. ఆ తర్వాత సనా జావెద్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈద్ సందర్భంగా రొమాంటిక్ ఫోటోను ఆ జంట పోస్టు చేసింది. ఇద్దరూ హగ్ చేసుకుంటున్న ఆ ఫోటోపై కామెంట్లు వచ్చి పడుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని మూడు నెలలు దాటింది. షోయెబ్ మాలిక్కి ఇది మూడవ మ్యారేజ్. సానియా మీర్జా కన్నా ముందు మరో ఇండియన్ మహిళ అయేషా సిద్ధికీ కూడా విడాకులు ఇచ్చేశాడు. షోయెబ్, సానియాకు ఓ కుమారుడు ఉన్నారు. అతని పేరు ఇజ్హన్ మీర్జా మాలిక్.