కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి పెండ్లి చేసుకున్నాడు. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ మరో ఇన్నింగ్స్కు తెరదీశాడు. పాకిస్థాన్ ప్రముఖ సినీతారగా గుర్తింపు పొందిన సనా జావెద్ను శనివారం పెండ్లి చేసుకున్నాడు. సంప్రదాయ పెండ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను మాలిక్ సోషల్మీడియాలో షేర్ చేశాడు.
మాలిక్కు ఇది మూడో వివాహం కాగా, సనాకు రెండోది. 2010లో ఆయేషా సిద్ధిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ అదే ఏడాది హైదరాబాదీ సానియాను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 2018లో కొడుకు ఇజాన్ పుట్టాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో దూరం దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం షోయబ్..ఇన్స్టాగ్రామ్లో సానియాను అన్ఫాలో చేయడం ఇందుకు మరింత బలాన్ని ఇచ్చింది.