ప్రపంచ క్రికెట్కు అత్యుత్తమ పేసర్లను అందించిన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. షోయబ్ అక్తర్, వసీం అక్రమ్ వంటి దిగ్గజాలతోపాటు కొత్తగా షహీన్ షా అఫ్రిదీ వంటి పేసర్లు కూడా పాక్ సొంతం. భారత్లో కూడా ఇటీవలి కాలంలో పేస్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తోంది. బుమ్రా, షమీ, ఉమేష్ వంటి వారితో పేస్ దళంలో ఎనలేని మార్పు వచ్చింది.
కానీ ఒక విషయంలో మాత్రం భారత పేసర్ల కన్నా పాక్ పేసర్లు మరింత ప్రభావవంతంగా ఉంటారని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. పాక్ ప్లేయర్లు అభిమానించే ఐడల్స్, తినే ఆహారం, వాతావరణం, యాటిట్యూడ్ అన్ని పేసర్లలో ఉత్సాహం నింపుతాయని చెప్పాడు. ఇటీవలి కాలంలో భారతదేశం కూడా మంచి పేసర్లను ఉత్పత్తి చేసిందని, కానీ ఎనర్జీ స్థాయుల్లో పాక్ పేసర్లు ఒక అడుగు ముందుంటారన్నాడు.
‘అక్కడి వారికి ఫుల్ ఎనర్జీతో ఉండే నాలాంటి వాళ్లున్నారు. దీనికితోడు మా దేశంలో చాలా జంతువులను తింటారు. అలా తినడం వల్లే పాక్ పేసర్లు సింహాల్లా పరిగెడతారు’ అని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్లీతో జరిగిన పాడ్క్యాస్ట్లో అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.